Thursday, May 02
Breaking News:

వికలాంగులకు పెంచిన పెన్షన్ ఉత్తర్వు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అరూరి.

1692860659_bsp.jpg

ఆసరా అవసరమైన దివ్యాంగులకు అందిస్తున్న మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్  వారికీ మరింత ఆర్థిక భరోసా కల్పించారాని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  తెలిపారు.

వర్దన్నపేట MMR గార్డెన్స్ లో వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి, వర్దన్నపేట మండలాల వికలాంగులకు పెంచిన పెన్షన్ ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే అరూరి రమేష్  అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే 
మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదనీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారికీ నెలకు అందించే పెన్షన్ ను 3116 నుండి 4116రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు. వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలో 5,265మంది వికలాంగులకు నెలకు 2కోట్ల 11లక్షల 44వేల 240రూపాయలను కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే దివ్యాంగులకు పెన్షన్ పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 11 వేల 656 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పెన్షన్ పెంపు వల్ల నెలకు 205 కోట్ల 48 లక్షలు ఆసరా కింద రాష్ట్రంలోని దివ్యాంగులకు అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మరియు పర్వతగిరి మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

Prev Post కాంగ్రెస్,బిజెపి పార...
Next Post కడియం శ్రీహరికి ఘన స...

More News