Thursday, May 02
Breaking News:

లండన్ విమానాశ్రయంలో కవితకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు

1696577629_kavit.jpg

రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హీత్రూ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం నాడు పబ్లిక్ పాలసీ పై  ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించనున్న సమావేశంలో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో యూకే రాజకీయ నాయకులు, ఎన్నారైలు, పౌర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు హాజరుకానున్నారు.

అలాగే లండన్ లోని అంబేద్కర్ మ్యూజియాన్ని కల్వకుంట్ల కవిత సందర్శిస్తారు. 

శనివారం రోజున ఎన్ఐఎస్ఏయు ఆధ్వర్యంలో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో సంభాషిస్తారు.

Prev Post పాఠశాల్లో సీఎం బ్రేక...

More News