Thursday, May 02
Breaking News:

సోనియా సభలో కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

1694774030_1600x960_260121-jitta-balakrishna-reddy.jpg

ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డితో పాటు మర్యాదపూర్వకంగా కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ ఆయన కోమటిరెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. గత రెండు రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్‌తోనూ భేటీ అయ్యారు.దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. జిట్టా సొంత నియోజక వర్గం భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లపై భరోసా లభించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభ సందర్భంగా కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

Prev Post ప్రగతిభవన్‌కు ఎమ్మెల...
Next Post టీబీజేపీ చీఫ్ కిషన్...

More News