Thursday, May 02
Breaking News:

సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ విడుదల

1694524761_Congress.jpg

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యుల్ ను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. సెప్టెంబర్ 16,17,18 తేదీలలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఈ మూడు రోజుల పాటు జరగబోయే కార్యక్రమాల వివరాలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో మీటింగ్ జరగనుంది. 17వ తేదీ ఉదయం 10:30 కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు,కౌన్సిల్, ఆఫీస్ బేరర్లు-సీపీపీలతో సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు విజయ భేరి సభలో 5 గ్యారంటీ స్కీమ్స్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ ప్రకటన విడుదల చేయనున్నారు. అనంతరం 119 నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ప్రకటన, రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు బస చేయనున్నారు. 18వ తేదీ ఉదయం కార్యకర్తలతో ముఖ్యనేతల సమావేశం, 5 గ్యారెంటీ స్కీమ్స్ పై డోర్ టూ డోర్ క్యాంపెయిన్ మధ్యాహ్నం కార్యకర్తల ఇళ్లలో లంచ్ కార్యక్రమం ఉండనుంది. సాయంత్రం స్థానికంగా ఉంటే మహాత్మాగాంధీ, అంబేద్కర్, కొమురం భీమ్ విగ్రహా వద్దకు భారత్ జోడో యాత్ర మార్చ్ నిర్వహించనున్నారు.

Prev Post కేసీఆర్ కెబినేట్ లోద...
Next Post సీఎం కేసీఆర్ పై కిషన...

More News