Thursday, May 02
Breaking News:

మంత్రి గంగుల కుటుంబ సభ్యలకు ఈడి నోటీసులు

1693899593_gangula-kamalakar.jpg

మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్వేతా గ్రానైట్స్ సంస్థ 
గ్రానైట్ ఎక్స్ పోర్ట్స్ ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి 4 కోట్ల 8 లక్షల రూపాయల ఫ్రాడ్ కు పాల్పడినట్లు ఈడీ ఆరోపించారు. చైనాకు గ్రానైట్ మెటీరియల్ ఎక్స్ పోర్ట్ చేయటంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో కేవలం 3 కోట్లు మాత్రమే శ్వేతా ఏజెన్సీస్ చెల్లిందని పేర్కోన్నారు. సుమారు 50 కోట్ల వరకు పెండింగ్ ఉందని, హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు. గత ఏడాది నవంబర్ లో శ్వేతా ఏజెన్సీస్ పై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

Prev Post తెలుగురాష్ట్రాల్లో భ...
Next Post సుప్రీం కోర్టులో గద్...

More News