Thursday, May 02
Breaking News:

ఐనవోలు మండలంలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్. కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నేతలు.

1692700264_WhatsApp Image 2023-08-22 at 10.04.48 AM.jpeg

హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలంలో అధికార బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ నమిండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో  బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎకలవ్య రాష్ట్ర చైర్మన్ రాయపురం సాంబయ్య, ఐనవోలు 1వ వార్డ్ మెంబెర్ లలిత వెంకట నారాయణ,13వ వార్డ్ మెంబెర్ బుర్ర మమత -సతీష్, మాజీ ఉపసర్పంచ్ మామూనూరి నర్సయ్య, జనసేన మండల అధ్యక్షులు md రహీం ఖాన్,సుమారు 200 మంది ఎకాలవ్య సంఘ నాయకులు వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి కొత్తూరి సునీల్, మైనారిటీ అధ్యక్షులు md రహీం పాషా,ఐనవోలు గ్రామపర్టీ అధ్యక్షులు బరిగాలా భాస్కర్,పున్నెలు గ్రామపర్టీ అధ్యక్షులు ఇల్లందుల సారయ్య,దోమకొండ హరీష్, మారుపట్ల రాజారామ్,కొత్తూరి ప్రతాప్, బొల్ల అశోక్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Prev Post కాంగ్రెస్ గెలుస్తుంద...
Next Post కమ్యూనిస్టుల సత్తా ఏ...

More News